ఆంధ్ర జాతీయ కళాశాల, మచిలీపట్నం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్ర జాతీయ కళాశాల

ఆవిర్భావం

[మార్చు]

ఆంధ్ర జాతీయ కళాశాలను 1910లో కోపల్లె హనుమంతరావు, ముట్నూరి కృష్ణారావు, పట్టాభి సీతారామయ్య స్థాపించారు. ఈ కళాశాల లో ఇంజనీరింగ్ తో సహా లలిత కళలు (డ్రాయింగ్, పెయింటింగ్, నాట్యం), చరిత్ర, ఫిలాసఫీ, భాష సంబంధిత కోర్సులు బోధించేవారు. ప్రమోద్ కుమార్ చటర్జీ, అడివి బాపిరాజు, కాటూరి వేంకటేశ్వరరావు, వీరంకి వెంకటశాస్తి మొదలైన వారు ఈ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు.

2009 ఫిబ్రవరిలో 100వ ఏట అడుగు పెడుతోంది. శతవార్షికోత్సవాలు ప్రారంభం కావాలి. దీనిని పాలిస్తున్న ఎండోమెంటు డిపార్టుమెంటు వారు ఈ మహా సభలకు పూనుకోవాలి. ప్రతి నెలా గొప్ప సభలు నిర్వహించాలి వచ్చే సంవత్సరానికి రాష్ట్రపతిని పిలిచి గొప్ప సభ జరపాలి. ప్రస్తుతం ఇందులో కృష్ణా విశ్వవిద్యాలయం ఉంది. అందులో ఆంధ్రజాతీయ విద్యా పరిషత్ విద్యా సంస్థలన్నిటినీ విలీనం చేసుకోవాలి. విశ్వవిద్యాలయం ఈ విద్యాసంస్థలన్నిటినీ మరింత అభివృద్ధి చెయగలుగుతుంది. ఎండోమెంటు వారు అభివృద్ధి చేయలేకపోతున్నారు. ఆంధ్ర జాతీయ కళాశాలకు ఈ ఏడు నూరేళ్ళు నిండిపోతాయో, నూరేళ్ళ పండగ చేసుకుంటుందో త్వరలో తేలిపోతుంది. పూర్వ విద్యార్థులు, ఇతరదేశాల అభిమానులు, బందరు పౌరులు, స్వతంత్ర భావ నిరతులు, విద్యా సంస్థల సిబ్బంది పూనుకోవాలి. కాంగ్రెసు వారు పూర్వం స్థాపించిన సంస్థ ఇది, కాంగ్రెసు వారు ఈ విషయం గమనించి దీని బాగుకు కృషి చేయాలి.శతజయంతి నాటికి శిథిలమై 100 ఏళ్ల సాక్షిగా శాశ్వతంగా మూతపడే ప్రమాదంలో పడ్డ ఈ కళాశాలను ప్రభుత్వం తీసుకొని, కొత్త జవజీవాలను అందించాలనేది అందరి ఆకాంక్ష. కృష్ణా యూనివర్సిటీ, జాతీయ కళాశాలను కలిపి అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలను ప్రజాప్రతినిధులు బలంగా ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది.ఆంధ్రజాతీయ కళాశాల 100 ఏళ్ల క్రితం ప్రారంభమైనప్పుడు వెలుగు వెలిగింది. ఇప్పుడు ఆ వెలుగు ఆరిపోతోంది. 320 ఎకరాల ఆస్తులున్నా కళాశాలకు ఉపయోగపడటంలేదు.గాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణ వంటివారు వచ్చి ఈ కళాశాల ఎప్పటికీ నిలిచిపోవాలని, ఇది దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. కళాశాలను దేవాదాయ శాఖ పరిధి నుంచి ప్రభుత్వం తీసుకోవాలి.కృష్ణా యూనివర్సిటీ ప్రస్తుతం కళాశాల ప్రాంగణంలోనే నడుస్తోంది. ఆస్తులతోపాటు కళాశాలలను కూడా యూనివర్సిటీకి అప్పగించాలనే ప్రతిపాదన ఉంది.ఇప్పటికే కళాశాల ప్రాంగణంలోనే ఉన్న ఐటీసీను తీసుకోవడానికి యూనివర్సిటీ సిద్ధంగా లేదని సమాచారం.

స్వర్ణోత్సవం

[మార్చు]

ఆంధ్ర జాతీయ కళాశాల స్వర్ణోత్సవం 1964 సంవత్సరంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖుల వ్యాసాలతో 'స్వర్ణోత్సవం' ప్రత్యేక సంచికను ప్రచురించారు.

జాతీయ కళాశాల పూర్వ విద్యార్థులు

[మార్చు]

అడివి బాపిరాజు, గుర్రం మల్లయ్య, పొట్లురి హనుమంతరావు, మాధవపెద్ది గోఖలే, తేజోమూర్తుల కేశవరావు, భోగరాజు వెంకట రత్నం, కౌతా శ్రీరామూర్తి, యస్. వి. యస్. రామారావు, కౌతా రామమోహన శాస్త్రి, కౌతా ఆనందమోహనశాస్త్రి, బాలగోపాల భాస్కరరాజు

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]